Asaduddin Owaisi: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై సంచలన ఆరోపణలు చేసిన అసదుద్దిన్ ఓవైసీ.. 12సార్లు తనను..

|

Jan 13, 2021 | 9:30 PM

Asaduddin Owaisi: సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు.

Asaduddin Owaisi: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై సంచలన ఆరోపణలు చేసిన అసదుద్దిన్ ఓవైసీ.. 12సార్లు తనను..
Follow us on

Asaduddin Owaisi: సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఓవైసీ బుధవారం మీడియాతో మాట్లాడారు. యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో తనను రాష్ట్రానికి రాకుండా 12 సార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో తనను పాల్గొనకుండా చేశారని అన్నారు. దాదాపు 28 సార్లు తనకు అనుమతి నిరాకరించారని చెప్పుకొచ్చారు.

కాగా, రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ఒవైసీ ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపడతామని చెప్పారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గెలిచే ఛాన్స్ లేదన్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోటీ చేసి గెలుపొందారు కూడా. ఒక్కొక్క రాష్ట్రంలో అడుగుపెడుతూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.

Also read:

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు ”హీరోయిన్” మూవీ

Telangana Corona Vaccine: తెలంగాణలో ఆయా జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్లు.. ఏ జిల్లాకు ఎన్ని డోసులంటే..