Amrit Mahotsav: మోదీ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.25 లక్షలు మీ సొంతం

|

Aug 26, 2021 | 12:40 PM

Amrit Mahotsav: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. కొత్త కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు..

Amrit Mahotsav: మోదీ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.25 లక్షలు మీ సొంతం
Follow us on

Amrit Mahotsav: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. కొత్త కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు భారీ ప్రైజ్ మనీ ఆఫర్‌ చేస్తోంది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు ఏకంగా రూ.25 లక్షలు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమృతో మహోత్సవ్ పేరుతో యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.25 లక్షలు అందిస్తోంది. మొదటి విజేతకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.15 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10 లక్షలు అందజేస్తోంది కేంద్రం.

వరల్డ్ క్లాస్ యాప్స్‌గా ఎదిగే సత్తా ఉన్న యాప్స్‌ను గుర్తించి వాటికి ప్రైజ్ మనీ అందిస్తారు. 16 కేటగిరిల్లో ఎంట్రీస్‌ను ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, అగ్రికల్చర్, న్యూస్, గేమ్స్, ఫిన్‌టెక్, నావిగేషన్ ఇలా 16 కేటగిరిల్లో మీరు అత్యున్నత ప్రమాణాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యాప్స్‌ను రూపొందించవచ్చు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఎంపిక ప్రాసెస్‌లో రెండు స్టేజ్‌లు ఉంటాయి. మొదటగా అర్హత కలిగిన ఎంట్రీస్‌కు స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత రెండో స్టేజ్‌లో జ్యూరీ ఎంపిక, డెమో వంటివి ఉంటాయి. షార్ట్ లిస్ట్ చేసిన యాప్స్ రివార్డు అందిస్తారు. భారతీయులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

 

ఇవీ కూడా చదవండి:

Positive Pay System: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి నిబంధనలు మారనున్నాయి.. తప్పక తెలుసుకోండి.!

Reserve Bank Of India: మరో సహకార బ్యాంకుకు భారీ జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంకు.. కారణం ఇదే..!