AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: మంటల్లో ఎయిర్‌ ఇండియా విమానం.. ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుండగా ఘటన

Air India: ఢిల్లీకి వెళ్తున్న విమానం నంబర్ AI 315 ల్యాండింగ్, గేట్ వద్ద పార్కింగ్ చేసిన వెంటనే సహాయక విద్యుత్ యూనిట్ (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు. ఇంతలో సిస్టమ్..

Air India: మంటల్లో ఎయిర్‌ ఇండియా విమానం.. ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుండగా ఘటన
Subhash Goud
|

Updated on: Jul 22, 2025 | 9:07 PM

Share

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. మీడియా నివేదికల ప్రకారం ఈ మంటల వల్ల విమానం కొంత దెబ్బతిన్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన సహాయక సిబ్బంది విమానం మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు, సిబ్బందిని రక్షించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. భారీ షాకిచ్చిన బంగారం ధర.. రూ.1140 పెరిగిన పసిడి.. తులం ధర తెలిస్తే..

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానం నంబర్ AI 315 ల్యాండింగ్, గేట్ వద్ద పార్కింగ్ చేసిన వెంటనే సహాయక విద్యుత్ యూనిట్ (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు. ఇంతలో సిస్టమ్ డిజైన్ ప్రకారం APU స్వయంచాలకంగా ఆగిపోతుంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

ఇది కూడా చదవండి: Auto News: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్‌తో పది నిమిషాల్లోనే మైలేజీ పెంచుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి