
ఏరో ఇండియా షో 14వ ఎడిషన్ ఏరో షోలో హనుమాన్ లోగోతో కూడిన విమానం అందరి దృష్టిని ఆకర్షించింది.

హనుమాన్ లోగోతో కూడిన విమానం గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి "రామ దూత అతులిత బల్ ధామ్ - అంజనీ పుత్ర పవన్ సుతా నామా" అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఏరో ఇండియా షోలో హనుమాన్ లోగోతో కూడిన మారుత విమానం వీక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

బెంగళూరులోని యలహంక ఎయిర్ఫీల్డ్లో ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది.