Accident News: రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. ఐదుగురు దుర్మరణం.. మరో ఐదుగురు..

|

Feb 16, 2021 | 9:15 AM

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఖోపోలీ సమీపంలోని ముంబై-పుణే ఎక్స్​ప్రెస్ రహదారిపై పలు వాహనాలు ఢీ కొన్నాయి. సోమవారం రాత్రి...

Accident News:  రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. ఐదుగురు దుర్మరణం.. మరో ఐదుగురు..
Follow us on

Accident News:  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఖోపోలీ సమీపంలోని ముంబై-పుణే ఎక్స్​ప్రెస్ రహదారిపై పలు వాహనాలు ఢీ కొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ​ఈ దుర్ఘటనలో పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే అలర్టైన అధికారులు, పోలీసులు యద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Also Read: