మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

| Edited By: Pardhasaradhi Peri

Aug 04, 2019 | 4:24 PM

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలొదిలారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బార్వానీ జిల్లా నివాలి అనే ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ యాత్రికుల బస్సు ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు […]

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!
Follow us on

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలొదిలారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బార్వానీ జిల్లా నివాలి అనే ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ యాత్రికుల బస్సు ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.