భారత ఆర్మీ దాడిలో 15 మంది పాక్‌ జవాన్లు, 8 మంది ఉగ్రవాదులు హతం..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 8:56 PM

ఏప్రిల్ 10వ తేదీన.. భారత ఆర్మీ పాక్‌ కవ్వింపుచర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో.. 15 పాక్ జవాన్లు హతమైనట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. మరో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఓ వైపు కరోనాతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని పోనివ్వకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతుండటంతో.. ఏప్రిల్ 10వ తేదీన […]

భారత ఆర్మీ దాడిలో 15 మంది పాక్‌ జవాన్లు, 8 మంది ఉగ్రవాదులు హతం..!
Follow us on

ఏప్రిల్ 10వ తేదీన.. భారత ఆర్మీ పాక్‌ కవ్వింపుచర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో.. 15 పాక్ జవాన్లు హతమైనట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. మరో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఓ వైపు కరోనాతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని పోనివ్వకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతుండటంతో.. ఏప్రిల్ 10వ తేదీన భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌తో దాడికి దిగింది. ఈ దాడిలో పాక్‌ భారీ నష్టాన్ని చవిచూసిందని అప్పుడే మనసైన్యం స్పష్టం చేసింది. టెర్రర్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌తో పాటుగా.. పాక్ ఆర్మీ లాంచింగ్‌ ప్యాడ్స్‌ కూడా ధ్వంసమైనట్లు వీడియో కూడా రిలీజ్‌ చేసింది ఇండియన్ ఆర్మీ. ఏప్రిల్ 5వ తేదీన కేరాన్ సెక్టార్‌లో భారత ఆర్మీ ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయం తెలిసందే. అయితే భారత ఆర్మీ జరిపిన దాడి నిజమే అని చెప్పిన పాక్.. కేవలం నలుగురు పౌరులు మాత్రమే మృతిచెందినట్లు చెప్పుకొచ్చింది. కానీ భారత ఆర్మీ దాడిజరిపిన వీడియో రిలీజ్‌ చేస్తూ.. లాంచింగ్ ప్యాడ్స్‌ ధ్వంసమవ్వడమే కాదు.. పాకిస్థాన్‌కు భారీగా నష్టం వాటిల్లి ఉంటుందని స్పష్టం చేసింది.