వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2019 | 9:42 AM

ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంనుం వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదితో వరదలో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్‌ను సైతం వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. అసోం, బీహార్ రాష్ట్రాల్లో 159 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అసోంలో శనివారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వరదలు, వర్షాల వల్ల చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే […]

వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు
Follow us on

ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంనుం వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదితో వరదలో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్‌ను సైతం వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. అసోం, బీహార్ రాష్ట్రాల్లో 159 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

అసోంలో శనివారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వరదలు, వర్షాల వల్ల చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,705 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 48 లక్షల మందికి పైగా వరదకు నిరాశ్రయులయ్యారు.

బీహార్ వ్యాప్తంగా 12 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరదల వల్ల శనివారం మరో అయిదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97కి పెరిగింది. కేవలం సీతామడి జిల్లాలోనే 27 మంది మృతి చెందారు. బీహార్‌లోని వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు తెగిపోవడంతో గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం కాపాడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది.