కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోని శ్లోక వైన్స్ మార్ట్లో లక్ష రూపాయల నగదు చోరీ అయ్యింది. షట్టర్లు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.