Spring Season: వసంతకాలం పరిమళాలు వెదజల్లే కాలం.. అందమైన ప్రదేశాలని చూస్తే మనసుకి కొత్త ఉత్సాహం..?

Spring Season: ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు భారతదేశంలోని ఎడారులు , పర్వతాలు,

Spring Season: వసంతకాలం పరిమళాలు వెదజల్లే కాలం.. అందమైన ప్రదేశాలని చూస్తే మనసుకి కొత్త   ఉత్సాహం..?
Spring Season

Updated on: Feb 02, 2022 | 4:23 PM

Spring Season: ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు
భారతదేశంలోని ఎడారులు , పర్వతాలు, బీచ్‌లు, జలపాతాల అందమైన దృశ్యాలను
ఆస్వాదించవచ్చు. దేశంలోని ప్రకృతి అందాలను చూసేందుకు వసంతకాలం ఉత్తమమైనదని
చెప్పవచ్చు. భారతదేశంలో వసంత రుతువు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉంటుంది. ఈ
వాతావరణం తేలికపాటి వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చలికాలం నుంచి ఉపశమనం
కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ప్రకాశవంతమైన సూర్యకాంతి మనసును ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు
వసంతకాలంలో అనేక ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశాలు
దేశవ్యాప్తంగా ప్రయాణానికి పర్యాటకానికి అనువైనవి. వాటి గురించి తెలుసుకుందాం.

1. డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్

డార్జిలింగ్ హిమాలయాల దిగువన ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. డార్జిలింగ్‌లో సందర్శించదగిన
ప్రదేశాలలో టైగర్ హిల్, బటాసియా లూప్, నైటింగేల్ పార్క్, డార్జిలింగ్ రాక్ గార్డెన్, డార్జిలింగ్
పీస్ పగోడా, టీ గార్డెన్ ఉన్నాయి. మీరు రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, షాపింగ్, రోప్‌వే రైడింగ్,
క్యాంపింగ్ స్థానిక వంటకాలలో మునిగిపోవచ్చు.

2. జిరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్

మీరు జిరో వ్యాలీలో వసంత ఋతువు విశాల దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. మీరు మేఘనా కేవ్
టెంపుల్, జీరో ప్లూటో, తారిన్ ఫిష్ ఫామ్, టాలీ వ్యాలీ, కైల్ పాఖోలను సందర్శించడానికి ప్లాన్
చేసుకోవచ్చు. ఇక్కడ క్యాంపింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ మీరు అందమైన పువ్వులు, పక్షుల
కిలకిలాలను ఆస్వాదించవచ్చు.

3. గుల్మార్గ్, జమ్మూ, కశ్మీర్

గుల్మార్గ్ పశ్చిమ హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణిలో ఉంటుంది. గుల్‌మార్గ్‌లో చూడదగ్గ
ప్రదేశాలలో అల్పతర్ లేక్, గుల్‌మార్గ్ గోల్ఫ్ కోర్స్, చిల్డ్రన్స్ పార్క్, నింగల్ నాలా, ఖిలన్‌మార్గ్,
గుల్‌మార్గ్ గొండోలా, స్ట్రాబెర్రీ వ్యాలీ, గుల్‌మార్గ్ బయోస్పియర్ రిజర్వ్ ఉంటాయి. సాహస
కార్యకలాపాల కోసం మీరు గోల్ఫ్, ట్రెక్కింగ్, స్నోబోర్డింగ్, స్కీయింగ్ ఆనందించవచ్చు.

4. అండమాన్ నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉంటాయి. పర్యాటకులు వసంత రుతువులో
ఇక్కడ సందర్శించి ఆనందించవచ్చు. మీరు డిగ్లీపూర్, సెల్యులార్ జైలు, రాధానగర్ బీచ్, రాస్
ఐలాండ్, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, లక్ష్మణ్‌పూర్ బీచ్, సాముద్రికా మెరైన్
మ్యూజియం, హేవ్‌లాక్ ద్వీపాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కయాకింగ్, స్కూబా
డైవింగ్, సీ వాకింగ్, స్నార్కెలింగ్, సీప్లేన్‌లో ప్రయాణించడానికి ఇది భారతదేశంలోని అత్యుత్తమ
ప్రదేశాలలో ఒకటి.

5. జైపూర్

రాజస్థాన్‌లోని పింక్ సిటీ అని పిలువబడే జైపూర్ వసంతకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన
ప్రదేశాలలో ఒకటి. జైపూర్‌లో చోఖి ధని, జైఘర్ కోట, హవా మహల్, అమెర్ ఫోర్ట్, మహల్,
జైఘర్ కోట, జంతర్ మంతర్, నహర్‌ఘర్ కోట, జైపూర్ జూ, గల్తాజీ టెంపుల్, సంభార్ సరస్సు,
లక్ష్మీ నారాయణ్ టెంపుల్ ఉంటాయి.

Corona: కరోనాని ఓడిస్తున్న Zycov-D.. మూడు డోసులకి కేవలం ఎంతంటే..?

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు ఎవ్వరితో కలవరు.. మాట్లాడటానికి ఇష్టపడరు..?

అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..

Loading...
Unable to load recommendations.
Follow Us