
ఐఆర్సీటీసీ తెలుగు పర్యాటకుల కోసం రెండు అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ కి వెళ్లాలనుకునే వారికీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్లో నేపాల్ ని పర్యటించే విధంగా ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..
హైదరబాద్ నుంచి నేపాల్ టూర్ సెప్టెంబర్ 12న ప్రారంభం అవుతుంది. 6 రాత్రులు.. 7 పగళ్ళుగా ఈ టూర్ సాగుతుంది. నేపాల్ లోని లుంబిని, పోఖరా, కాట్మండు, జనక్ పూరి వంటి ప్రాంతాలను వీక్షించవచ్చు. మొత్తం 30 మంది ఈ టూర్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రారంభ టికెట్ ధర రూ.43,330.
ఫస్ట్ డే: హైదరబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. విమానం ఉదయం 11.10 స్టార్ట్ అయి.. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్కి వెళ్తారు. అక్కడి నుంచి వాహనంలో ప్రయాణిస్తూ నేపాల్కి పయనం అవుతారు. లుంబినికి చేరుకొని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
సెకండ్ డే : రెండో రోజు ఉదయం లుంబిని నుంచి పోఖరాకు వెళ్తారు. అక్కడ పగోడా, మాయ దేవి ఆలయన్ని సందర్శిస్తారు. ఈ రోజు రాత్రి పోఖరాలోనే బస చేస్తారు.
మూడో రోజు: మూడో రోజు ఉదయం పోఖరాలోని సారంగ్కోట్ సన్రైజ్ వ్యూ పాయింట్, బింద్యాబాసిని మందిరం, దేవీ ఫాల్స్, గుప్తేశ్వర మహదేవ గుహాలు చుస్తాసారు. ఫేవా సరస్సులో బోటింగ్ కూడా చేయవచ్చు. ఈ రోజు రాత్రి కూడా పోఖరాలోనే బస చేస్తారు.
ఫోర్త్ డే: నాలుగో రోజు ఉదయం కాట్మండుకి బయలు దేరతారు. మార్గమధ్యంలో మనోఖన్మ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం కాట్మండులో స్థానిక ప్రదేశాలను చూడవచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది.
ఐదో రోజు: ఐదో రోజు ఉదయం స్థానిక ప్రదేశాలను సందర్శించవచ్చు. పశుపతినాథ ఆలయం, స్వయంభునాథ దేవాలయం ,దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్ వంటి ప్రదేశాలను చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది.
ఆరో రోజు: ఆరో రోజు ఉదయం హోటల్ నుంచి నేరుగా సీతా దేవి పుట్టిన ఊరు జనక్పుర్కి పయనం అవుతారు. అక్కడ హోటల్లో దిగి ఫ్రెషప్ అయ్యాక జానకి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు.
ఏడో రోజు: ఈ ఉదయం జానక పూరి నుంచి దర్భంగా ఎయిర్పోర్టుకు పయనం అవుతారు. ఇక్కడ నుంచి విమానం ద్వారా నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీ టికెట్స్ ధరల వివరాలు..
సింగిల్ – షేరింగ్ రూ. 61400
డబుల్ ఆక్యుపెన్సీ – రూ. 48,330
ట్రిపుల్ షేరింగ్- రూ.43,630 చెల్లించాలి.
ఇక 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.38,200, విత్ అవుట్ బెడ్ అయితే 22260 చెల్లించాలి ఉంటుంది.
నేపాల్కు ప్రయాణించే భారతీయ పౌరుడికి ప్రవేశించిన తేదీ నుంచి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటరు ఐడి తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..