
Sapta Jyotirlinga Tour: శైవ భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునేలా “సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఏడు ప్రసిద్ధ జ్యోతిర్లింగాలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
జూన్ 16న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికులకు సికింద్రాబాద్తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో ఎక్కే సౌకర్యం అందుబాటులో ఉంది.
యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వర్ దర్శనం అనంతరం ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత గుజరాత్లోని ద్వారక, నాగేశ్వర్, సోమనాథ్ క్షేత్రాల దర్శనం ఉంటుంది. అనంతరం మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
అయితే ఆలయాలు లేదా పర్యాటక ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక ప్రవేశ రుసుములు, అదనపు వ్యక్తిగత సదుపాయాల ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది.
శైవక్షేత్రాల దర్శనం కోసం తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన యాత్ర చేయాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీ మంచి అవకాశం అని చెప్పొచ్చు.
సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.