
భారతదేశంలోని బీచ్లు తమ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. కానీ కొన్ని బీచ్లు రాత్రివేళల్లో ఒక అద్భుతమైన ప్రకృతివిశేషాన్ని చూపిస్తాయి. అదే బయోల్యూమినిసెన్స్. సముద్ర అలలు కదిలినప్పుడు నీలిరంగు కాంతి మెరుస్తూ, నక్షత్రాలు నీటిలో కలిసిపోయినట్లుగా అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఇది మాయ కాదు; సముద్రంలో ఉండే సూక్ష్మ జీవులు (ప్లాంక్టన్) కారణంగా ఏర్పడే సహజ ప్రక్రియ. ఇలాంటి మంత్ర ముగ్ధం చేసే దృశ్యాన్ని మనం భారతదేశంలోని కొన్ని ప్రత్యేక బీచ్లలో చూడవచ్చు. అవి ఇవే:
అండమాన్ దీవుల్లో అత్యంత ప్రసిద్ధమైన ద్వీపం ఇది. పగటిపూట అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనిపిస్తే, రాత్రివేళల్లో నీటిలో మెరిసే నీలి కాంతి ఈ ద్వీపాన్ని మరింత మాయాజాలంగా మారుస్తుంది. ముఖ్యంగా మడ అడవుల మధ్య ఈ వెలుగులను చూడటం ఒక అద్భుత అనుభవం.
లక్షద్వీప్లోని ఈ ద్వీపం ప్రశాంతతకు, స్వచ్ఛతకు పేరుగాంచింది. కొన్ని రాత్రుల్లో అలలు కదిలినప్పుడు స్వల్ప నీలి కాంతి మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే ముందుగా అనుమతి అవసరం.
గోవాలోని ఈ బీచ్ జనసంచారం తక్కువగా ఉండి ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత రాత్రివేళల్లో అలలపై నీలి కాంతి మెరుస్తూ కనిపించడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి దృశ్యం వజ్రాలు నీటిలో చల్లినట్లుగా అనిపిస్తుంది.
ఉడుపి సమీపంలో ఉన్న ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో కొన్ని సందర్భాల్లో అలలలో మెరుస్తూ కనిపించే కాంతి ఈ బీచ్కు ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన గమ్యం.
ముంబై పశ్చిమ ఉపనగరాల్లో ఉన్న ఈ బీచ్ కూడా బయోల్యూమినిసెన్స్ అనుభవానికి ప్రసిద్ధి. రాత్రివేళల్లో అప్పుడప్పుడు అలలలో నీలి కాంతి మెరుస్తూ కనిపిస్తుంది. నగరానికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇది ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది.
ఈ బీచ్లలో ప్రతి ఒక్కటి ప్రకృతి అద్భుతమైన కళాఖండంలా అనిపిస్తుంది. రాత్రివేళల్లో మెరిసే సముద్ర అలలు మనకు గుర్తు చేస్తాయి.. ప్రకృతి ఎప్పుడూ తనదైన మాయాజాలాన్ని మనకు చూపిస్తూనే ఉంటుంది.