
ఉదయం లేదా సాయంత్రం వేళ ఒక కప్పు వేడి టీ అలసటను దూరం చేసి మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, రోజుకు అనేక కప్పుల టీ తాగే అలవాటు శరీర ఆరోగ్యాన్ని క్రమంగా బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి భోజనం తర్వాత టీ జీర్ణక్రియకు సహాయపడుతుందని, నీరసాన్ని తగ్గిస్తుందని నమ్మకం ఉన్నా, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. టీలోని టాక్సిన్లు విటమిన్ B12 ను తగ్గించవచ్చు. టానిన్లు ఆహారంలోని ఐరన్ను గ్రహించకుండా అడ్డుకుంటాయి, దీనివల్ల రక్తహీనతకు దారితీస్తుంది.
టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ టానిన్లు ఆహారంలోని ఐరన్తో కలిసిపోతాయి, దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్ను సమర్థవంతంగా గ్రహించలేకపోతుంది. ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ ప్రభావం ముఖ్యంగా వెజిటేరియన్లకు మరింత హానికరం, ఎందుకంటే వారి ఆహారంలో ఐరన్ మూలాలు పరిమితంగా ఉంటాయి. కెఫిన్ కడుపులో ఆమ్లాలను పెంచి గుండెల్లో మంటను కలిగిస్తుంది. థియోఫిలిన్ మలబద్ధకానికి కారణం కాగా, ప్రోటీన్ల జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. భోజనం తర్వాత కాఫీ తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. రాత్రిపూట టీ లేదా కాఫీ తాగితే కెఫిన్ వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి ఒక గంట తర్వాత టీ లేదా కాఫీ తాగాలి.