IRCTC Package: టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. నేపాల్ పర్యటన ఆఫర్ వింటే ఎగిరిగంతేస్తారు..

దేశీయ పర్యటనలతో ఆకట్టుకున్న ఐఆర్‌సీటీసీ కొన్ని రోజులుగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోడానికి సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం నేపాల్‌కు భారీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

IRCTC Package: టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. నేపాల్ పర్యటన ఆఫర్ వింటే ఎగిరిగంతేస్తారు..
Irctc Rooms

Updated on: Feb 17, 2023 | 4:00 PM

పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఐఆర్‌సీటీసీ ఎప్పకటిప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతూ విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ దేశీయ పర్యటనలతో ఆకట్టుకున్న ఐఆర్‌సీటీసీ కొన్ని రోజులుగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోడానికి సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం నేపాల్‌కు భారీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. బెస్ట్ ఆఫ్ నేపాల్ ఎక్స్ ఢిల్లీ పేరుతో ప్రారంభమయ్యే ఈ ప్యాకేజ్ ఆరు రోజులు/ఐదు రాత్రుల పాటు ఉంటుంది. అలాగే ఐఆర్‌సీటీసీ టూర్ మార్చి 30న ఢిల్లీ నుంచి ఖాట్మండు వరకూ విమాన సర్వీస్‌తో ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో ముఖ్యంగా పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు  నేపాల్‌లోని పోఖారోతో సహా ఇతర ప్రదేశాలను వీక్షించవచ్చు. 

పర్యటనలో అందించే సదుపాయాలు

ఈ టూర్ ప్యాకేజీలో ఐదు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఐదు డిన్నర్లు, డీలక్స్ AC బస్సు సౌకర్యం, ఇంగ్లిష్ మాట్లాడే గైడ్‌లు, రాత్రిపూట బస చేయడానికి హోటల్ వంటి సౌకర్యాలను ఐఆర్‌సీటీసీ కల్పిస్తుంది. అయితే లంచ్ ప్యాకేజీను మాత్రం ఇందులో కలపలేదు. యాత్రకు వెళ్లే వారి సంఖ్యను బట్టి ప్యాకేజీ ఛార్జీలు ఆధారపడి ఉంటాయి. ట్రిపుల్ లేదా డబుల్ ఆక్యుపెన్సీ కోసం, ప్యాకేజీ ధర రూ. ఒక్కొక్కరికి 31,000. ఒక్క వ్యక్తికి ప్యాకేజీకి రూ. 40,000. పిల్లలను కూడా యాత్రకు తీసుకెళ్లవచ్చు. దీనికి ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. ఈ ఖర్చులు రూ. 2,400 నుండి రూ. 3,000 వరకూ ఉంటాయి. 

నేపాల్‌లో చూడాల్సిన ప్రదేశాలు 

నేపాల్ భారతదేశానికి సమీపంలో ఉన్న పర్వత దేశం. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్న పశుపతినాథ్ దేవాలయం హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. కాబట్టి పశుపతినాథ్ ఆలయాన్ని ఈ ప్యాకేజీ ద్వారా చూడవచ్చు. అలాగే దర్బార్ స్క్వేర్, స్వయంభూనాథ్ స్థూపంతో పాటు, అందమైన సరస్సులకు ప్రసిద్ధి చెందిన పోఖారాను వీక్షించవచ్చు. ముఖ్యంగా అద్భుతమైన విమాన ప్రయాణ అనుభూతిని పొందేందుకు ఈ టూర్ ప్యాకేజీ చాలా బాగుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.