Health Tips: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగండి.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి..

|

May 02, 2021 | 2:51 PM

Health Tips: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా రక్కసి కారణంగా ఎంతో మంది ప్రాణాలు..

Health Tips: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగండి.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి..
Kismiss
Follow us on

Health Tips: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా రక్కసి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇదే సమయంలో ఎంతోమంది కరోనా బారిన పడిన వారు చాలా సునాయాసంగా కోలుకుంటున్నారు. కారణం వారిలోని ఇమ్యూనిటీపవర్ ప్రధానం అని చెప్పాలి. అలాగే వారిలోని ఆత్మ విశ్వాసం కూడా అత్యంత ప్రధానం అని చెప్పాల్సిందే. కరోనా రాగానే హైరానా పడాల్సిన అవసరం లేదు. మనం రోజూ ఆహారంగా తీసుకునే కొన్ని పదార్థాలతోనే కరోనా నుంచి కోలుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా ఎండుద్రాక్ష (కిస్‌మిస్)ను ప్రధాన ఆరోగ్య ప్రదాయినిగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎండుద్రాక్ష ఎంతగానో ఉపకరిస్తుంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

ఎండుద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండుద్రాక్షలో భాస్వరం, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఒక్కడ ఎండుద్రాక్ష మాత్రమే కాదు.. ఎండుద్రాక్ష నీరు కూడా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను కొన్నింటిని రాత్రి ఒక కప్పు వాటర్‌లో వేసి ఉంచాలి. వాటిని మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేయడానికి ముందు తీసుకోవాలి. ఆ ఎండు ద్రాక్షతో పాటు.. ఆ వాటర్‌ను కూడా తాగాలి. ఎండుద్రాక్ష వేసిన వాటర్ తాగడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధిత జబ్బుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. హై బీపీ, హార్ట్ ఎటాక్ వాంటి వాటి నుంచి రక్షిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఎండుద్రాక్షను, వాటిని నానబెట్టిన నీటిని రోజూ తీసుకోవడంతో ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read:

నాది పట్టాభూమి కాదని నిరూపిస్తే మొత్తం ఆస్తినంతా రాసిస్తా.. బండి సంజయ్‌కి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌

రెండువందల ఏళ్లుగా గ్రామాన్ని కాపాడుతున్న శ్రీ గంగానమ్మ.. ఇప్పటికీ అక్కడి ప్రజలకు కలలోకి కనిపించే మోటూరు గ్రామ దేవత..