
కేరళ వంటకాలు తమ ప్రత్యేకమైన రుచులు, సుగంధ ద్రవ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందులో, కొట్టాయం స్టైల్ ఫిష్ కర్రీ ఒక డైమండ్. ఇది స్పైసీ, టాంగీ రుచుల సమ్మేళనంతో ఆకట్టుకుంటుంది. ఈ సాంప్రదాయ వంటకం, మలబార్ చింతపండు వాడి తయారు చేస్తారు. ఇది కర్రీకి స్పెషల్ రుచిని ఇస్తుంది. వీకెండ్లో మీ ఫ్యామిలీకోసం రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేయాలనుకుంటే, ఈ కొట్టాయం ఫిష్ కర్రీ రెసిపీ సరైన ఎంపిక. ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసే స్టెప్స్ ఇక్కడున్నాయి. ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.
చేపలు (సీర్ ఫిష్, సార్డినెస్, టిలాపియా లేదా సాల్మన్) – 500 గ్రా (మీడియం సైజు ముక్కలుగా కట్ చేయండి)
కొబ్బరి నూనె లేదా వంటనూనె – 3 టేబుల్ స్పూన్లు
మలబార్ చింతపండు
ఆవాలు – 1/2 టీస్పూన్
మెంతులు – 1/4 టీస్పూన్
ఉల్లిపాయలు (షాలాట్స్ లేదా చిన్న ఉల్లిపాయలు) – 10-12, సన్నగా తరిగినవి
అల్లం – 1 ఇంచ్ ముక్క, సన్నగా తరిగినది
వెల్లుల్లి – 5-6 రెబ్బలు, సన్నగా తరిగినవి
పచ్చిమిర్చి – 2, చీల్చినవి
కరివేపాకు – 2 రెమ్మలు
టమోటో – 1, సన్నగా తరిగినది
కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు (కాశ్మీరీ కారం పొడి ఉపయోగిస్తే తక్కువ స్పైసీగా ఉంటుంది)
ధనియాల పొడి – 1 1/2 టేబుల్ స్పూన్
పసుపు పొడి – 1/4 టీస్పూన్
మెంతుల పొడి – 1/4 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – 1 1/2 కప్పులు
చేప ముక్కలను శుభ్రంగా కడిగి, ఉప్పు కొద్దిగా పసుపుతో రుద్ది పక్కన పెట్టండి.
కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, మెంతుల పొడిని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్గా చేసి పక్కన ఉంచండి.
మలబార్ చింతపండుని 1/2 కప్పు గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి.
మట్టి కుండ లేదా నాన్స్టిక్ పాన్లో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేయండి.
ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించండి.
తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటో వేసి, ఉల్లిపాయలు స్వల్పంగా బ్రౌన్ అయ్యే వరకు మీడియం మంటపై వేయించండి.
మంటను తగ్గించి, సిద్ధం చేసిన మసాలా పేస్ట్ను వేసి, ముడి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించండి.
నానబెట్టిన చింతపండు రసం, ముక్కలను, దాని నీటితో సహా, పాన్లో వేసి కలపండి.
1 1/2 కప్పుల నీటిని జోడించి, ఉప్పు వేసి, మసాలా మిశ్రమాన్ని మరిగించండి.
చేప ముక్కలను సున్నితంగా కర్రీలో వేసి, మీడియం-తక్కువ మంటపై 10-12 నిమిషాలు ఉడికించండి. చేపలు విరిగిపోకుండా జాగ్రత్తగా కదిలించండి.
కర్రీ సరైన రుచి కోసం టేస్ట్ చెయ్యండి. అవసరమైతే కొద్దిగా ఉప్పు లేదా పులుపు కోసం చింతపండు రసం వేయండి.
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కొన్ని తాజా కరివేపాకులను చిలకరించి, 2-3 నిమిషాలు సిమ్ లో మరిగించండి.
కర్రీని 3-4 గంటలు అలాగే వదిలేసి తర్వాత తింటే రుచి బాగా పట్టుకుంటుంది. రెండవ రోజు ఇది మరింత రుచికరంగా ఉంటుంది.