Mysore Bonda: మైదా లేకుండా మైసూర్ బజ్జీలను ఇలా చేయండి.. చాలా హెల్దీ!

| Edited By: Ram Naramaneni

Nov 02, 2023 | 9:49 PM

ఉదయం టిఫిన్స్ లో మనం తినే వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. వీటి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా చేసుకుని ప్లేట్ ల మీద పేట్లు లాగించేస్తారు. అయితే వీటిని మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండితో చేసిన ఏ ఆహార పదార్థమైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మైదా పండి తినడం వల్ల ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైసూర్ బోండాలను కేవలం మైదా..

Mysore Bonda: మైదా లేకుండా మైసూర్ బజ్జీలను ఇలా చేయండి.. చాలా హెల్దీ!
Mysore Bonda
Follow us on

ఉదయం టిఫిన్స్ లో మనం తినే వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. వీటి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా చేసుకుని ప్లేట్ ల మీద పేట్లు లాగించేస్తారు. అయితే వీటిని మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండితో చేసిన ఏ ఆహార పదార్థమైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మైదా పండి తినడం వల్ల ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైసూర్ బోండాలను కేవలం మైదా పిండితోనే కాకుండా.. గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో తయారు చేసినవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి గోధుమ పిండితో మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ బోండాలకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, పుల్లటి పెరుగు, జీల కర్ర, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, ఉప్పు, బియ్యం పిండి, వంట సోడా.

ఇవి కూడా చదవండి

మైసూర్ బోండాలు తయారు చేయు విధానం:

వీటిని తయారు చేసుకోవడానికి ముందు రాత్రే పిండిని నాన బెట్టుకోవాలి. ముందుగా ఒక లోతైన పాత్ర తీసుకోవాలి. ఇందులో గోధుమ పిండి, రెండు స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు, పుల్లటి పెరుగు, కొద్దిగా జీల కర్ర, కొద్దిగా వేడి నూనె వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పిండిలా కలుపు కోవాలి. ఈ పిండిని అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. అప్పటికప్పుడు కలుపుకుంటే మాత్రం అరగంట ముందే వంట సోడా వేసి, కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. కానీ ముందు రోజు రాత్రి కలుపుకుంటే మాత్రం ఎంతో టేస్టీగా ఉంటాయి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక పిండి తీసుకుని కొద్దిగా వంట సోడా వేసుకుని బాగా కలుపు కోవాలి. తర్వాత పిండిని తీసుకుని గుండ్రంగా నూనెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండాలు రెడీ అవుతాయి. వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. బోండాలను గోధుమ పిండితో తయారు చేసి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఒకసారి వీటిని తయారు చేసి చూడండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిని పిల్లలకు ఎలాంటి డౌట్స్ లేకుండా పెట్టవచ్చు.