
ఇడ్లీ అంటే మన భారతీయులకు ఎంతో ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యకరమైన పోషకాలు ఎక్కువగా ఉండే రాగితో ఇడ్లీ చేసుకుంటే ఇంకా మంచిది. రాగి ఇడ్లీ తేలికగా జీర్ణం అవుతుంది. రుచిగా, పోషకంగా ఉండే ఈ ఇడ్లీ పిల్లలు, పెద్దలందరికీ బాగా నచ్చుతుంది. ఇంట్లోనే కాటన్లా మెత్తటి రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నానబెట్టిన మెంతులను గ్రైండర్లో వేసి మూడు నిమిషాలు రుబ్బుకోవాలి. మెంతులు తేలిపోతున్నప్పుడు మినపప్పు వేసి కనీసం 25 నిమిషాలు రుబ్బుకోవాలి. తర్వాత మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి మార్చాలి. అనంతరం నానబెట్టిన ఎర్ర అటుకులను గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత నానబెట్టిన ఎర్ర బియ్యం, రాగి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో తగినంత ఉప్పు వేసి మళ్లీ కలపాలి. చివరగా ఈ పిండిని కనీసం 8 గంటలు పులియబెట్టాలి.
రాగిలో కాల్షియం అధికంగా ఉండటంతో ఇది ఎముకల బలానికి ఎంతో మంచిది. అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యను తగ్గించేందుకు రాగిలో ఉండే ఐరన్ ఎంతో సహాయపడుతుంది. రుచిగా, పోషకంగా ఉండే రాగి ఇడ్లీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.