
నాన్ వెజ్ ప్రియులలో సీ ఫుడ్ ప్రియులు వేరు. వీరికి చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటితో చేసిన ఆహరాన్ని అమితంగా ఇష్టం. అయితే చేపలను తినడానికి అమితంగా ఇష్టపడేవారున్నారు. వీరు చేపలతో రకరకాల పదార్దాలను తయారు చేస్తారు. ఇష్టపడతారు. ఇండియన్ స్టైల్ లో కూర, పులుసు, వేపుడు మాత్రమే కాదు చైనీస్ స్టైల్ లో చేప మంచూరియన్, చేప టిక్కాలను కూడా ఇష్టంగా తింటారు. ఫిష్ టిక్కా అనేది ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. చేప ముక్కలను మసాలా దినుసులతో కలిపి మ్యారినేట్ చేసి.. తరువాత కాల్చి లేదా వేయించి వడ్డిస్తారు. ఇది రుచికరమైన ఫిష్ టిక్కా సులభంగా తయారుచేసే వంటకం. రెసిపీ ఏమిటంటే..
ఫిష్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్ధాలు
తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేడి చేసి శనగపిండి వేసి.. పేస్ట్ లా చేసి వేసి ఒక నిమిషం పాటు వేయించి.. సుగంధ ద్రవ్యాలు వేసి లేత రంగు వచ్చేవరకు వేయించాలి.
తీసుకున్న చేపలను శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో సగం నూనె, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, నిమ్మ తొక్కు, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న శనగ పిండి మసాలా పేస్ట్లో వేసి పెరుగుతో కలపండి.
చేపల మ్యారినేట్ కోసం తీసుకున్న అన్ని పదార్థాలను బాగా కలపండి.
చేపల ముక్కలపై సిద్ధం చేసుకున్న శనగపిండి మసాలా మిశ్రమాన్ని చేపలకు పట్టించండి.
ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కలను గంటసేపు ఒక పక్కన పెట్టండి. ఓవెన్ను 200 డిగ్రీల సెల్సియస్కు వేడి చేసి మ్యారినేట్ చేసిన చేపలను బేకింగ్ డిష్లో వేయండి.
తందూరి చేపలను పై రాక్లో 10-15 నిమిషాలు కాల్చండి. చేపల ముక్కలను ఒకసారి తిప్పండి. ఇలా చేప ముక్కలను గ్రిల్ చేసే సమయంలో చేప ముక్కలను వెన్నతో ఒకటి లేదా రెండుసార్లు కాల్చండి.
గ్రిల్ చేయడంతో ఫిష్ టిక్కా రెడీ. ఇప్పుడు వీటిని చట్నీ లేదా సాస్తో వేడిగా వడ్డించండి. పిల్లలు పెద్దలు లోట్టలేసుకుంటూ తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..