
మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటై సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్లోకి చపాతీ, రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. వీటని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుతాయని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు ఆహారాలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని సరైన క్రమంలో తీసుకుంటే రెండు ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటాయని వారు చెబుతున్నారు.
రైస్ వర్సెస్ చపాతి
ఒక కప్పు రైస్లో దాదాపు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండగా , చపాతీలో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యం కంటే చపాతీలో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలో బియ్యం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక చపాతీలో దాదాపు 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో గోధుమ కంటే భాస్వరం, మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. ఇది ఫోలేట్, ఐరన్ రెండింటిలోనూ సమానంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రెండింటినీ తినవచ్చు. కానీ వాటిని సరైన పరిమాణంలో తీసుకోవడం మఖ్యం.
చపాతీ వల్ల ప్రయోజనాలు
చపాతీలు తినడం వల్ల అన్నం మోతాదును నియంత్రించడం సులభం అవుతుంది. రెండు చపాతీలతో భోజనం ముగించడం ఉత్తమం. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మిశ్రమ ధాన్యాలతో తయారు చేసిన చపాతీలలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. శుద్ధి చేయని, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన తృణధాన్యాల పిండిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు .
డిన్నర్కి ఏది బెస్ట్?
(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడిని.. ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం నుంచి అందిస్తున్నాం. కాబట్టి వీటిపై మీకేవైసా సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)
మరిన్నిలైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.