AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాత్రికి రేగు పండ్లను నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా?

మహా శివరాత్రి పండుగ నాడు రేగుపండ్లను నైవేద్యంగా పెడతారు. రేగి పండ్లును బదరీఫలం అంటారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారట. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. ఈ కారణంగానే ఈ పండ్లను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు..

శివరాత్రికి రేగు పండ్లను నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా?
Benefits Of Ber Fruits
Srilakshmi C
|

Updated on: Feb 12, 2026 | 11:59 AM

Share

మహా శివరాత్రికి నైవేధ్యంగా పెట్టే ఈ రేగి పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం రేగు పండ్లలోని సహజ లక్షణాలు శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తాయి. ఉపవాస సమయంలో శక్తిని కాపాడుకోవడానికి సహాయపడతాయి. పోషకాలతో సమృద్ధిగా ఉండే పండ్లు రేగు పండ్లు. వీటిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు కూడా రేగు పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా రేగు పండ్లను తినాలని సిఫార్సు చేస్తున్నారు. మహాశివరాత్రి పండుగ సమీపిస్తున్నందున రేగు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థ బలోపేతం

రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ప్రేగులను శుభ్రంగా ఉంచుతాయి.

రోగనిరోధక శక్తి పెంపు

రేగు పండ్లు విటమిన్ సి కి మంచి మూలం. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రేగు పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కాలానుగుణ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

రక్తహీనత

రేగు పండ్లలో ఐరన్‌, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది

రేగు పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తాయి.

బలహీనత తొలగింపు

నిపుణుల అభిప్రాయం ప్రకారం రేగు పండ్లలో సహజ చక్కెరలు, తక్షణ శక్తిని అందించే పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అలసట, బలహీనత, బద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్