
వేసవి ఎండలు భరించలేనంతగా ఉన్నాయి. ఫ్యాన్లు సరిపోవు, ఏసీలు ఖరీదైనవి సామాన్యులు కొనలేరు. అలాంటి వారికి మట్టి కుండ కూలర్లు అద్భుతమైన ఎంపిక హైదరాబాద్కు చెందిన జోగు ప్రమోద్ ఈ ఎకో ఫ్రెండ్లీ కూలర్లను రూపొందించారు. మన పాతకాలం మట్టి కుండల సూత్రంతో, ఇవి చల్లని గాలిని అందిస్తాయి. తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా ఉండటంతోపాటు ఇళ్లలో, చిన్న షాపుల్లో నడిపించేందుకు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. దీంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులను ఇష్టపడే వారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సామాన్యుడి ఎయిర్ కూలర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మట్టి కుండలు నీటిని నిదానంగా ఆవిరి చేస్తాయి. గాలిలోని వేడిని తీసుకుని చల్లదనం ఇస్తాయి. ఈ కూలర్లో రెండు కుండలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. కింది కుండలో నీళ్లు, పై కుండలో ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ గాలిని నీటి మీదుగా పంపితే, చల్లని గాలి బయటకు వస్తుంది. గంటకు 45 వాట్స్ కరెంట్ మాత్రమే వాడతాయి, ఏసీల కంటే చాలా తక్కువ. గదిలో 3-4 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గించగలవు.
ఈ కూలర్లు రూ. 4,000 నుంచి ప్రారంభమవుతాయి, రకాన్ని బట్టి రూ. 8,000 వరకు ఉంటాయి. ఒక్కో కూలర్ 10-12 రోజుల్లో తయారవుతుంది. జోగు ప్రమోద్ హైదరాబాద్లోని తన వర్క్షాప్లో వీటిని చేస్తాడు. ఆసక్తి ఉన్నవారు 630-149-1499 నంబర్కు కాల్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా కొన్ని సైట్లలో దొరుకుతాయి, కానీ స్థానికంగా కొనడం సులభం.
ఈ కూలర్లు బయోడిగ్రేడబుల్ మట్టితో తయారవుతాయి, కరెంట్ బిల్లు తగ్గిస్తాయి, పర్యావరణానికి హాని చేయవు. ఎక్కువ సౌండ్ లేకుండా సైలెంట్ గా పనిచేస్తాయి. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా సులభం. చిన్న గదులు, షాపులు, కార్యాలయాలకు ఇవి బెస్ట్. స్థానిక కుమ్మరులకు ఆదాయం తెస్తూ, సాంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తుండటం వీటి ప్రత్యేకత.