
రాత్రిపూట నిద్రలేమి, తలనొప్పి శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆలోచనలను పూర్తిగా ఆపడం ఎవరికీ సాధ్యం కానప్పటికీ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి సైకాలజీ నిపుణులు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ను సూచిస్తున్నారు. మరి మీ మెదడును ఆలోచనల దాడి నుంచి రక్షించి, క్షణాల్లో ప్రశాంతంగా మార్చే ఆ 3 మోస్ట్ పవర్ఫుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.
1. 5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్
మీ మెదడు ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతూ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నప్పుడు, మీ దృష్టిని ప్రస్తుత క్షణం పైకి మళ్లించడానికి ఈ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఈ క్రింది వాటిని మనసులో అనుకోవాలి:
మీ కంటికి కనిపించే 5 వస్తువులను గుర్తించండి.
మీరు తాకగలిగే 4 విషయాలను (ఉదాహరణకు మీ బట్టలు లేదా కుర్చీ) స్పృశించండి.
మీ చుట్టూ వినిపించే 3 శబ్దాలను నిశ్శబ్దంగా ఆలకించండి.
మీ ముక్కుకు తెలిసే 2 వాసనలను గమనించండి.
మీ నాలుకకు తెలిసే 1 రుచిని మనసులోకి తెచ్చుకోండి.
ఈ ప్రక్రియ వల్ల మెదడు పాత ఆలోచనల నుండి బయటపడి ప్రస్తుత వాతావరణంలోకి వస్తుంది. దీనివల్ల క్షణాల్లో ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది.
2. ఆలోచనలకు ఒక ‘సమయం’ కేటాయించండి
రోజంతా ఏదో ఒక విషయానికీ ఆలోచిస్తూ సమయాన్ని, శక్తిని వృథా చేసే బదులు.. రోజులో కేవలం 15 నుండి 20 నిమిషాల సమయాన్ని ‘ఆలోచించే సమయం’ గా ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకు సాయంత్రం 5 నుండి 5:20 వరకు మాత్రమే నేను బాధపడతాను లేదా ఆలోచిస్తాను అని మీ మెదడుకు కండిషన్ పెట్టండి.
రోజంతా మీకు ఏ ఆలోచన వచ్చినా.. “దీని గురించి నేను సాయంత్రం ఆలోచిస్తాను” అని పక్కన పెట్టేయండి.
అలా కేటాయించిన సమయంలో మాత్రమే ఆ సమస్యల గురించి ఆలోచించి, వీలైతే వాటికి పరిష్కారాలను ఒక పేపర్పై రాసుకోండి. ఈ ట్రిక్ ద్వారా రోజంతా పనులపై పర్ఫెక్ట్ ఫోకస్ పెరుగుతుంది.
3. ఆలోచనలను డైరీలో రాయడం
మెదడులో ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు అవన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి పెద్ద గందరగోళం సృష్టిస్తాయి. దీనికి బెస్ట్ సొల్యూషన్.. ఒక నోట్బుక్ లేదా డైరీ తీసుకుని మీ మనసులో ఉన్న ఆలోచనలను, భయాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా పేపర్పై రాసేయడం.
ఇలా మనసులోని భావాలను అక్షర రూపంలో పెట్టడం వల్ల మెదడుపై ఉన్న భారం తక్షణమే తగ్గిపోతుంది.
పేపర్పై రాసినప్పుడు సమస్య తీవ్రత ఎంత? మనం అనవసరంగా ఎంత భయపడుతున్నాం? అనే విషయాలపై స్పష్టత వస్తుంది.
వీటితో పాటు ప్రతిరోజూ ఉదయం కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం, ఒత్తిడి అనిపించినప్పుడు ఐదు సార్లు సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారి మానసిక దృఢత్వం పెరుగుతుంది.