వైసీపీకి విజయవాడలో పెద్ద షాక్ తగిలింది. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎంఎస్ బేగ్ పార్టీకు రాజీనామా చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇస్తానని ద్రోహం చేశారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతేకాదు జగన్ ను 20 సార్లు కలవడానికి ప్రయత్నించినా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన చెందారు బేగ్.
మరోవైపు వైసీపీ పార్టీ పశ్చిమలో బలోపేతం అవ్వడానికి ముస్లిం సోదరులు ఎంతగానో కృషి చేశారన్నారు. వైసీపీలో మైనారిటీలకు స్థానం లేదని.. 9 జిల్లాల్లో కేవలం ఒక్క సీటే ఇచ్చారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు సీటు ఇవ్వడం బాధాకరం అని బేగ్ తెలిపారు