వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభపక్ష నేతగా జగన్ పేరును బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఆమోదాన్ని ముక్తకంఠంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గం.4.30గంటలకు జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఆ తరువాత ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా కలిసే అవకాశం ఉంది.