యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

|

Jun 01, 2020 | 6:13 PM

గంజాయి మత్తులో కొందరు యువకులు నడిచి వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి

యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి
Follow us on

తిరుపతిలో కొందరు యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. ఒంటరిగా నడిచి వెళ్తున్నవారే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. తాజాగా యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. గంజాయి మత్తులో కొందరు యువకులు అతనిపై కత్తితో దాడి చేశారు. వెంటనే గమనించిన స్థానికులు అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. స్థానిక తాతయ్యగుంటకు చెందిన కొందరు యువకులు గంజాయి సేవించి దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో వెంకటసాయి అనే యువకుడిపై దాడికి దిగారు.  తీవ్రంగా గాయపడ్డ యువకుడిని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు షరా మామూలు అయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరుగురు యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.