టీడీపీ నేతలపై విజయసాయి రెడ్డి ట్వీట్

| Edited By:

Jun 15, 2019 | 11:11 AM

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన రెండు పార్టీల మధ్య వార్‌కి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]

టీడీపీ నేతలపై విజయసాయి రెడ్డి ట్వీట్
Follow us on

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన రెండు పార్టీల మధ్య వార్‌కి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదే అంశంపై వైసీపీ నుంచి కౌంటర్ పంచ్‌లు ఇస్తున్నారు నేతలు. ప్రతిపక్ష నేతగా ఉండగా.. జగన్ పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకి ఏదో జరిగినట్లు శోకాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్ ను ఆపడం లేదని.. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు.