స్కూటీ నడిపి.. మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా!

| Edited By:

Jan 18, 2020 | 5:50 PM

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్కూటీ నడిపి వాహనదారులకు ఓ మెసేజ్ ఇచ్చారు. తన కుమారుడిని వెనుక కూర్చొబెట్టుకొని.. రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని పుత్తూరులో స్కూటీ నడిపారు రోజా. ‘వేగం కన్నా.. ప్రాణం మిన్న, హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించేలా స్లోగన్స్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు […]

స్కూటీ నడిపి.. మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా!
Follow us on

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్కూటీ నడిపి వాహనదారులకు ఓ మెసేజ్ ఇచ్చారు. తన కుమారుడిని వెనుక కూర్చొబెట్టుకొని.. రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని పుత్తూరులో స్కూటీ నడిపారు రోజా. ‘వేగం కన్నా.. ప్రాణం మిన్న, హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించేలా స్లోగన్స్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రోజా. అంతేకాకుండా.. తనతో పాటు వాహనంపై వెనుక సీటులో కూర్చొన్న కుమారుడు కూడా హెల్మెట్‌ ధరించాడు. రోజాతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు, పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు.