ఆదివారం వైన్ షాపులు కూడా బంద్…

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోలు సర్వీసులు సైతం […]

ఆదివారం వైన్ షాపులు కూడా బంద్...

Updated on: Mar 21, 2020 | 6:35 PM

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోలు సర్వీసులు సైతం నిలిపివేయబడ్డాయి. పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాల షాపులు, పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేందుకు అనుమతించారు.

ఈ నేపథ్యంలో రేపు తెలంగాణలో వైన్ షాపులు కూడా బంద్ కానున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,400 వైన్ షాపులు మూతపడనున్నాయి. వైన్ షాపులు మూసివేస్తున్నట్టు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే స్టేట్‌లో 700 బార్లు మూతపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us