AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడెల కుమారుడికి… కోటి రూపాయల పెనాల్టీ?

కోడెల ఆత్మహత్యకు ఆయన సంతానమే కారణమని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించి ఆ కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి తండ్రి రాజకీయ ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజ్ చేశారనే పేరు తెచ్చుకున్నారు కోడెల శివరాం.  అయితే కోడెల ఆత్మహత్యను ప్రభుత్వంపై అస్త్రంగా వాడదామని చంద్రబాబు నాయుడు ప్రయత్నించి విఫలం అయ్యారు. కోడెల అప్పటికే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మృతి అనంతరం […]

కోడెల కుమారుడికి... కోటి రూపాయల పెనాల్టీ?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 7:00 PM

Share

కోడెల ఆత్మహత్యకు ఆయన సంతానమే కారణమని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించి ఆ కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి తండ్రి రాజకీయ ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజ్ చేశారనే పేరు తెచ్చుకున్నారు కోడెల శివరాం.  అయితే కోడెల ఆత్మహత్యను ప్రభుత్వంపై అస్త్రంగా వాడదామని చంద్రబాబు నాయుడు ప్రయత్నించి విఫలం అయ్యారు. కోడెల అప్పటికే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మృతి అనంతరం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూడటం వివాదంగా నిలిచింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆ వ్యవహారాన్ని వదిలేశారు.

అయితే కోడెల శివరాం చేసిన అక్రమాలపై విచారణ మాత్రం సాగుతూ ఉంది. అందులో భాగంగా ఆయన బైకుల రిజిస్ట్రేషన్ వివాదం ఒకదాంట్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదం పై అధికారులు విచారణ జరిపించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించకుండా బైకులను అమ్మి.. కోడెల శివరాం ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయల నష్టాన్ని చేకూర్చినట్టుగా అధికారులు గుర్తించారు. సాక్షాలతో సహా ఆ విషయంలో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవలే విచారణ జరిపి కోటి రూపాయల మేరకు ఫైన్ విధించారు. తాజాగా ఆ ఫైన్ ను కోడెల శివరాం కట్టినట్టుగా తెలుస్తోంది. బైకుల రిజిస్ట్రేషన్ స్కామ్ కు సంబంధించి ఆయన ఈ ఫైన్ చెల్లించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.