
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట ఫోన్ దిగ్గజం వివో తాజాగా భారత్లో కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వివో టీ1 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ 66 వాట్స్ ఫ్లాష్ చార్జ్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఈ ఫోన్ కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.

5జీ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 16 వేల లోపు ఉండొచ్చని అంచనా. మే 4 నుంచి ఫ్లిప్కార్ట్తో పాటు వివో అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.