కరకట్ట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల దుర్మరణం

కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.

కరకట్ట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల దుర్మరణం

Updated on: Aug 04, 2020 | 3:24 PM

కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. రాఖీ పండుగ సందర్భంగా అవనిగడ్డలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకుపోయి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న తల్లీ కొడుకు మృతి చెందారు. భర్త, రెండేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారుతో పాటు మృత దేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ తండ్రి కొడుకులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us