TS CM KCR Review : తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు(సెప్టెంబర్22) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ పోర్టల్ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆకాంక్షించారు.
— Telangana CMO (@TelanganaCMO) September 21, 2020