హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ బంపరాఫర్లు. టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో నగర ప్రజలకు పలు బంపరాఫర్లు ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్ పలు తాయిలాలను ప్రకటించారు.

హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ బంపరాఫర్లు. టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

Updated on: Nov 23, 2020 | 3:53 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. వచ్చే నెల నుంచి వాటర్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 98 శాతం మంది ప్రజలకు 20 వేల లీటర్ల నీటిని ఫ్రీగా సరఫరా చేస్తామని వెల్లడించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ధోబీఘాట్లను రిపేర్ చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. మ్యానిఫెస్టోలోని మరికొన్ని  ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

హైదరాబాద్‌ ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా
డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు
20 వేల లీటర్ల లోపు నల్లానీటి వినియోగం ఉచితం
సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్
కరోనా కాలం నుంచి రూ.267 కోట్ల మోటార్‌ వాహన పన్నులు రద్దు
ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు మోటార్‌ వాహన పన్ను మాఫీ
పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌డీ, ఎల్టీ కేటగిరి విద్యుత్‌ కనెక్షన్లకు..
ఆరు నెలల కాలానికి మినిమం డిమాండ్‌ చార్జీ రద్దు
రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ సాయం
రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు సవరించుకునేందుకు వెసులుబాటు
తాగునీటి అవసరాల కోసం త్వరలోనే కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులు

టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి TRS party GHMC election Manifesto 1-6

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us