పురపోరులో వార్ వన్ సేడ్ కానుంది.. గులాబీ ప్రభంజనం వీయనుంది. ప్రతిపక్షాలకు మల్లి నిరాశే మిగలనుంది.. తాజాగా సీపీఎస్ సర్వేలో నివ్వెరపోయే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ మున్సిపల్ ఫలితాలపై సీపీఎస్ సర్వే విడుదల చేసింది. 120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్కు 0-4 స్థానాలు, బీజేపీకి 0-2 స్థానాలు గెలిచే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎంకు 1-2 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సీపీఎస్ సర్వే వెల్లడించింది. 7-10 మున్సిపాలిటీల్లో పోటాపోటీగా ఫలితం ఉంటుందని పేర్కొంది. 9-10 మధ్య మున్సిపల్ కార్పొరేషన్లు టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 0-1 స్థానాన్ని బీజేపీ గెలిచే అవకాశం ఉందని సీపీఎస్ సర్వే వెల్లడించింది.