పాడేరులో పిడుగుల బీభత్సం..

| Edited By:

Jun 17, 2019 | 1:04 PM

విశాఖలో పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. కాగా.. కొన్ని ప్రాంతాల్లో చెట్లపై పిడుగులు పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరులో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకి చెట్టుపై మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల్లో చెట్టు కాలిపోవడంతో స్థానికులు భయంతో కేకలు వేశారు. నిప్పు రవ్వలు వచ్చి ఇళ్లపై పడతాయోమోనన్న భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 

పాడేరులో పిడుగుల బీభత్సం..
Follow us on

విశాఖలో పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. కాగా.. కొన్ని ప్రాంతాల్లో చెట్లపై పిడుగులు పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లా పాడేరులో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకి చెట్టుపై మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల్లో చెట్టు కాలిపోవడంతో స్థానికులు భయంతో కేకలు వేశారు. నిప్పు రవ్వలు వచ్చి ఇళ్లపై పడతాయోమోనన్న భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.