జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే

ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్(JEE Mains) పరీక్ష నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల(Schedule Released) చేసింది....

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే
Jee Advanced 2022
Follow us

|

Updated on: Mar 01, 2022 | 9:16 PM

ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్(JEE Mains) పరీక్ష నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల(Schedule Released) చేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్‌, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ (పరీక్షలు) డా. సాధనా పరాషర్‌ వెల్లడించారు. పరీక్షలు రాసే అభ్యర్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్‌ విధానంలో రెండు విడతలుగా నిర్వహించారు. 2021లో మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నాలుగు విడతల్లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహిస్తే చాలని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్.. గురువారం విడుదలైన విషయం తెలిసిందే. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఈ పరీక్ష నిర్వహిస్తున్న బాంబే ఐఐటీ గురువారం సమగ్ర వివరాలు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు జూన్‌ 8 నుంచి జూన్‌ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ మొదలవుతుందని ప్రకటించింది.

Also Read

UP Elections 2022: ఆరో దశ ఎన్నికల్లో నేర చరిత్ర నాయకులు అధికమే.. కోటీశ్వరులు ఎక్కువే.. వివరాలివే

Operation Ganga: ప్రతి ఒక్క భారతీయుడినీ స్వదేశానికి చేర్చడమే.. ఆపరేషన్ గంగ ప్రధాన లక్ష్యం

Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్