Telugu University Results : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన యూనివర్సిటీలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఒకటి. భాషా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరంలాగే 2020- 21 విద్యా సంవత్సరానికి బీఎఫ్ఏ తో పాటు ఇతర పీజీకోర్సులలో చేరుటకు డిసెంబర్ 29న పరీక్ష నిర్వహించింది.
ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. శిల్పం ,చిత్రలేఖనం , జ్యోతిష్యం, జర్నలిజం అంశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 11న, నృత్యం, తెలుగు అంశాలకు సంబంధించిన పరీక్షలలో అర్హత పొందిన వారికి ఈ నెల 12న… విశ్వ విద్యాలయం సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కన్వీనర్ డాక్టర్ కె.హనుమంతరావు తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థుల ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.teluguuniversity.ac.in లేదా www pstu.org లలో చూడవచ్చని ప్రకటించారు.
Mumbai: ఆ కేసులో ప్రముఖ కామెడి కింగ్కు సమన్లు.. ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళిన హస్యనటుడు..