గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

|

Jun 25, 2020 | 8:36 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ ప్ర‌వేశ పరీక్ష ఫలితాలను విడుదల అయ్యాయి. మొత్తం సీట్లు 10,960 సీట్లకు గానూ RJCCET-2020 ఫ‌లితాలను గురువారం అధికారులు విడుద‌ల చేశారు.

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
Follow us on

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ ప్ర‌వేశ పరీక్ష ఫలితాలను విడుదల అయ్యాయి. మొత్తం సీట్లు 10,960 సీట్లకు గానూ RJCCET-2020 ఫ‌లితాలను గురువారం అధికారులు విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం(ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గ్రూపు)కు చేపట్టిన ప్రవేశ పరీక్షకు గానూ 68,938 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ప్ర‌వేశ ప‌రీక్షకు హాజరై విద్యార్థులందరికీ వారి మొబైళ్లకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించినవారితో పాటు అర్హ‌త సాధించిన విద్యార్థులకు రిజిస్ర్ట‌ర్ మొబైల్ నంబ‌ర్ కు మేసేజ్ పంపిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఫ‌లితాల కోసం www.tswreis.in. వెబ్ సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చని వివరించారు. అర్హ‌త సాధించిన విద్యార్థులంద‌రూ.. జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో రిపోర్టు చేయాల‌ని సూచించారు. సంబంధిత ప‌త్రాలైన హాల్ టికెట్, కులం, ఆదాయ ధృవ‌ప‌త్రాలు, టీసీ, సెల‌క్ష‌న్ కాపీతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటోతో అయ సంబంధిత కళాశాలలకు వెళ్లాలని వెల్లడించారు. నిర్ణీత స‌మ‌యంలో విద్యార్థులు రిపోర్టు చేయ‌క‌పోతే.. సీటు ర‌ద్దు అవుతుంద‌ని తెలిపారు.