రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు

రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు

Updated on: Oct 23, 2020 | 12:14 AM

Dussehra Holiday : రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా ప్రకటించింది.

కేంద్రం మాదిరిగానే 26న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సంఘం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాసింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారం మూడు రోజు కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందాన్ని వ్యాక్తం చేశారు.

తెలంగాణ ప్రాంతంలో దసరాను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటుండంతో.. వారికి ఈ సెలవు దినం ఉపయోగకరం మారనుంది. కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ వ్యాప్తి  మొదలైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us