Breaking : తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. ఆరుగురు మృతి

|

Jun 01, 2020 | 9:02 PM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్: కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృతి

Breaking :  తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. ఆరుగురు మృతి
Follow us on

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమ‌వారం రాత్రి బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94 కొత్త కేసులు న‌మోదు కాగా.. అందులో 79 మంది జీహెచ్ఎంసీ ప‌రిధిలోని వారేన‌ని తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మూడు, మేడ్చల్ జిల్లాలో 3, మెదక్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైంద‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1491కి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే కొత్త‌గా ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 88కి చేరిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం మొత్తంగా 1213 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది.