ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేతల కౌంటర్.. చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని ఆగ్రహం

|

Dec 13, 2020 | 10:22 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరుజిల్లా కలిగిరిలో టీడీపీ నేతలు..

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేతల కౌంటర్.. చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని ఆగ్రహం
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరుజిల్లా కలిగిరిలో టీడీపీ నేతలు, మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించే అర్హత పెద్దిరెడ్డి కుటుంబానికి లేదన్నారు. కురబలకోట మండలం అంగళ్లు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుల పై జరిపిన దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరిగే అరాచకాలను శంకర్ రెడ్డి ఎక్కడ బయట పడతారోనన్న భయంతోనే శంకర్ యాదవ్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డికి పూజ చేయడంలోనే సరిపోతుందని ప్రజల బాగోగులను జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.