ఎయిర్‌ ఏషియా ఇండియా.. టాటా సన్స్ చేతుల్లోకి..?

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా

ఎయిర్‌ ఏషియా ఇండియా.. టాటా సన్స్ చేతుల్లోకి..?

Updated on: Jul 10, 2020 | 1:30 AM

Tata Sons in talks to acquire AirAsia India: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా భాగస్వామికి చెందిన 49శాతం వాటా కొనుగోలు కోసం టాటా సన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా టాటాల పరమవుతుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌కు 49 శాతం వాటా ఉంది.

కరోనా సంక్షోభం సమయంలో ఎయిర్‌ ఏషియా నుంచి ఈ వాటాను టాటా సన్స్‌ చాలా చౌకగా దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ ఆర్థిక కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఆస్తులను మించిన అప్పులు, అన్ని జాయింట్‌ వెంచర్లు నష్టాల్లో నడుస్తుండటంతో ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ 18.8 కోట్ల డాలర్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఎయిర్‌ ఏషియా ఇండియా రూ.330 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us