దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది: మన్మోహన్ సింగ్

| Edited By:

Aug 07, 2019 | 12:14 PM

దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందని అన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఉదయం సుష్మా పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన చిన్నమ్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ‘‘సుష్మా స్వరాజ్ మరణం నన్ను కలిచివేసింది. లోక్‌సభలో విపక్షపార్టీ నేతగా ఉన్నప్పటి నుంచి సుష్మాతో నాకు ఎన్నో మంచి ఙ్ఞాపకాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా గౌరవించిబడే వ్యక్తులలో సుష్మా ఒకరు. ఆమె […]

దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది: మన్మోహన్ సింగ్
Follow us on

దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందని అన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఉదయం సుష్మా పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన చిన్నమ్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

‘‘సుష్మా స్వరాజ్ మరణం నన్ను కలిచివేసింది. లోక్‌సభలో విపక్షపార్టీ నేతగా ఉన్నప్పటి నుంచి సుష్మాతో నాకు ఎన్నో మంచి ఙ్ఞాపకాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా గౌరవించిబడే వ్యక్తులలో సుష్మా ఒకరు. ఆమె గొప్ప పార్లమెంటేరియన్, కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌లో ఎంతో తెలివిగల వ్యక్తిగా పేరొందింది. సుష్మా మరణంతో దేశం ఓ గౌరవమైన, ప్రత్యేక నాయకురాలిని కోల్పోయింది’’ అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.