ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

|

Dec 14, 2020 | 4:11 PM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్‌నగర్‌లో ఓ పెళ్లిలో గందరగోళం చెలరేగింది. వివాహం ముగిసిన తరువాత వరుడు..వధువును అక్కడే వదిలేసి కల్యాణమండపం నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్‌నగర్‌లో ఓ పెళ్లిలో గందరగోళం చెలరేగింది. వివాహం ముగిసిన తరువాత వరుడు..వధువును అక్కడే వదిలేసి కల్యాణమండపం నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కట్నం విషయంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాల మధ్య విబేధాలు తలెత్తడంతో అతడు ఇలా చేశాడట.  ఈ నేపథ్యంలో కాళ్ల పారణితో మెట్టినింట అడుగుపెట్టాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. పంచశీల నగర్ ఏరియాకు చెందిన రామ్ మోహన్ కుమారుడు మెడికల్ షాపు రన్ చేస్తున్నాడు. అతనికి అశోక్ విహార్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లికి వచ్చినవారంతా నిండు మనసుతో వధూవరులను దీవిస్తోన్న సమయంలో కానుకలు ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. అది కాస్తా పెరిగి పెద్దదై భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన వరుడు వధువును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. వధువు తరపువారు ఎంత రిక్వెస్ట్ చేసినా వరుని తరపువారు పట్టు వీడలేదు. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వరకు వెళ్లింది. పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చి దంపతులను కలిపే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

COVID Vaccine : ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్