తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..

|

Aug 05, 2020 | 7:51 PM

రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు దేవస్థానం అధికారులు..

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..
Follow us on

రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ కళ్యాణోత్సవ సేవలో భక్తులు పాల్గొనున్నారు. ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని తిరుమల  తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.