MLA Vidadala Rajini :ఇటీవల శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై దాడి చేసిన కొందరు వ్యక్తులు..అందులో ఉన్న ఎమ్మెల్యే మరిది గోపిని గాయపరిచారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో దాడితో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం 24 మందిపై కేసు నమోదవ్వగా… మిగిలిన 18 మందిని విచారిస్తున్నారు.