AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
Balaraju Goud
|

Updated on: Dec 25, 2020 | 9:16 PM

Share

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కషాయం కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు బీజేపీ బలం 48కి చేరింది. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న జేడీయూ ఒక్కస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇదిలావుండగా, గతేడాది జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ అభ్యర్థలు గెలుపొందారు. కానీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నెల క్రితం ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు జేడీయూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంపై ఉన్న విశ్వాసం కారణంగానే వారు తమ పార్టీలోకి చేరారని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ బయూరాం వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే తీరుపట్ల జేడీయూ నేతలు మండిపడుతున్నారు. తాజా పరిణామాలపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. ఈ సంఘటనలతో సంబంధం లేకుండా తాము ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక ప్రతిపక్షంగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు.