AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
Balaraju Goud
|

Updated on: Dec 25, 2020 | 9:16 PM

Share

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కషాయం కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు బీజేపీ బలం 48కి చేరింది. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న జేడీయూ ఒక్కస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇదిలావుండగా, గతేడాది జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ అభ్యర్థలు గెలుపొందారు. కానీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నెల క్రితం ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు జేడీయూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంపై ఉన్న విశ్వాసం కారణంగానే వారు తమ పార్టీలోకి చేరారని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ బయూరాం వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే తీరుపట్ల జేడీయూ నేతలు మండిపడుతున్నారు. తాజా పరిణామాలపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. ఈ సంఘటనలతో సంబంధం లేకుండా తాము ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక ప్రతిపక్షంగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు.

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే