రామనామంతో మార్మోగిన భద్రాద్రి

| Edited By:

Apr 14, 2019 | 3:29 PM

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్త జనసందోహం మధ్య ఆ జగదానంద కారకుడి కల్యాణ ఘట్టం కన్నుల పండువను తలపించింది. అభిజిత్ లగ్నంలో సుముహూర్తాన సీతమ్మ మెడలో రాముల వారు తాళికట్టారు. రాములోరి పెళ్లి వేడుకను కనులారా వీక్షించి భక్తులు తరించిపోయారు. భద్రాద్రి మిథిలా స్టేడియంలో మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రామనామ స్మరణతో మారుమోగింది. ఉదయాన్నే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి నుంచి కల్యాణ […]

రామనామంతో మార్మోగిన భద్రాద్రి
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్త జనసందోహం మధ్య ఆ జగదానంద కారకుడి కల్యాణ ఘట్టం కన్నుల పండువను తలపించింది. అభిజిత్ లగ్నంలో సుముహూర్తాన సీతమ్మ మెడలో రాముల వారు తాళికట్టారు. రాములోరి పెళ్లి వేడుకను కనులారా వీక్షించి భక్తులు తరించిపోయారు. భద్రాద్రి మిథిలా స్టేడియంలో మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రామనామ స్మరణతో మారుమోగింది. ఉదయాన్నే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి నుంచి కల్యాణ మూర్తులను.. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రోచ్చరణల మధ్య రామయ్య కల్యాణాన్ని జరిపించారు వేదపండితులు. మిథిలా స్టేడియంలో జరిగిన రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. చలవ పందిళ్ల కింద కూర్చొని భక్తులు ఆ రామయ్య పెళ్లి వేడుకను కనులార్పకుండా తిలకించారు.

 

సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.